ఇందూరు/నిజామాబాద్ సిటీ, జూలై 22 : తెలంగాణకు విముక్తికోసం ఉద్యమించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. దాశరథి జయంతిని జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో, తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో కేర్ డిగ్రీకళాశాలలో, గాంధీ విచార్మంచ్ ఆధ్వర్యంలో గీతాభవన్లో గురువారం నిర్వహించారు. జిల్లా పరిషత్లో నిర్వహించిన కార్యక్రమంలో దాశరథి చిత్రపటానికి జడ్పీ చైర్మన్ విఠల్రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో గోవింద్, టీఆర్ఎస్ నాయకులు గంగారెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
కేర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ మహాకవి దాశరథి పాదస్పర్శతో నిజామాబాద్ గడ్డ మరింత చైతన్యం పొందిందని, ప్రతి ఉద్యమంలో తన సత్తా చాటి తెలంగాణకు ఆయువు పట్టుగా నిలిచిందని అన్నారు.
దాశరథి ప్రతిఒక్కరికీ చైతన్యస్ఫూర్తి ప్రదాత అని, ఖిల్లా జైలు వేదికగా ఆయన కురిపించిన అగ్నిధార యావత్ తెలంగాణ ఉద్యమాలకు దిక్సూచిగా నిలిచిందన్నారు.కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు, ప్రముఖ కవి గోశిక నర్సింహస్వామి, తిరుమల శ్రీనివాస్ ఆర్య, తంగళ్లపల్లి నరేశ్, గోశిక రవి, మద్దుకూరి సాయిబాబు, తొగర్ల సురేశ్, మల్లవరపు చిన్నయ్య, కిరణ్ రామావత్, నవలా రచయిత పోత్నూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ విచార్ మంచ్ ఆధ్వర్యంలో గీతా భవన్లో రాజ్కుమార్ సుబేదార్ దాశరథి జయంతిని నిర్వహించారు. కవులు వారి కవితలను వినిపించారు. కార్యక్రమంలో విచార్ మంచ్ కార్యదర్శి మేక రామస్వామి, మేడిచర్ల ప్రభాకర్, నర్సింహం, దారం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.