బీర్కూర్, జూలై 18: తెలంగాణ పండరీపూర్గా పే రొందుతున్న మండలంలోని భైరాపూర్ విఠలేశ్వర ఆల యం పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నది. ఏకాదశి పర్వదినం సందర్భంగా అప్పుడే భక్తుల సందడి మొదలయ్యింది. ప్రతిఏటా ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశి పండుగకు బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు దిండి తీసుకొని పాదయాత్రగా మహారాష్ట్రలోని పండరీపూర్కు వెళ్లేవారు. అక్కడ ఆలయం మూసి ఉంచడంతో భక్తులు భైరాపూర్లోని విఠలేశ్వరుడిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఈ మేరకు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ధర్మకర్త ద్రోణవల్లి సతీశ్ తెలిపారు. బీర్కూర్ శివారులోని మంజీరానదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి భైరాపూర్లోని ఆలయాన్ని దర్శించుకుంటారన్నా రు. ఉపవాసం ఉన్న భక్తులకు మంగళవా రం ఫలహారం, బుధవారం అన్నదానం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఆలయంలో ఆషాఢ మాసం పూజలు..
విఠలేశ్వర ఆలయంలో భక్తులు ఆదివారం ఆషాఢమాసం పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా రుక్మిణి విఠలేశ్వరుడి విగ్రహాలకు ప్రత్యేక పూజలు, అర్చన, హారతి తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ మేనేజర్ మాణిక్రావు, భక్తులు పాల్గొన్నారు.