డిచ్పల్లి, జూలై 22 : తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడవ బెటాలియన్లో కమాండెంట్ ఎన్వీ సత్యశ్రీనివాస్రావు ఆధ్వర్యంలో గురువారం 371 మంది ఎస్సీటీపీసీఎస్ టీఎస్ఎస్పీ 2020-21 బ్యాచ్ దీక్షాంత్ పరేడ్ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ రేంజ్ ఐజీపీ ఎన్.శివశంకర్రెడ్డి పాల్గొన్నారు. కమాండెంట్ సత్య శ్రీనివాస్రావు ఐజీపీ శివశంకర్రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఐజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని భావించి సీఎం కేసీఆర్ పోలీసుశాఖకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అన్ని వసతులతో కూడిన జిల్లా పోలీస్ కార్యాలయాలు, పోలీస్ కమీషనరేట్లు, పోలీస్స్టేషన్లను నిర్మింపజేశారన్నారు. అనంతరం శిక్షణలో అత్యుత్తమ ప్రతిభకనబర్చిన ఎస్సీటీపీసీఎస్లకు ఐజీపీ మెమెంటో అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ కె.సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ కమాండెంట్ ఎం.వెంకటేశ్వర్లు, ఎస్.విష్ణుమూర్తి, కేవీ రమణ, సి.ఆంజనేయరెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీదేవి, యూనిట్ డాక్టర్ అనుపమ, ఆర్ఐలు రాజు, వెంకటేశ్వర్లు, రామకృష్ణ, సర్దార్నాయక్, అనిల్కుమార్, మహేశ్, నరేశ్, ప్రహ్లాద్, వసంత్రావు, సురేశ్, ఆర్ఎస్సైలు, బెటాలియన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.