బాన్సువాడ, జూలై 13: పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ అని, ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తా వద్ద బాన్సువాడ బిచ్కుంద ప్రధాన రహదారి డివైడర్ల మధ్యలో స్థానిక బల్దియా పాలకవర్గ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి మంగళవారం మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా అప్పట్లో నాటిన మొక్కలు నేడు చెట్లుగా ఎదిగి మంచి వాతావరణాన్ని అందిస్తూ.. ఆహ్లాదాన్ని పంచుతున్నాయన్నారు. బల్దియా పాలకవకర్గ సభ్యులు ఆయనకు మొక్కను అందజేశారు. బాన్సువాడ అగ్నిమాపక కేంద్రం ఎస్సై నర్సింగ్రావు కోరిక మేరకు డీసీసీబీ చైర్మన్ స్థానిక ఫైర్స్టేషన్ను సందర్శించారు. తమ కార్యాలయ గదులు శిథిలావస్థకు చేరుకున్నాయని, సిబ్బంది ఉండేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎస్సై వివరించారు. విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తానని డీసీసీబీ చైర్మన్ వారికి భరోసా ఇచ్చారు. ఆయన వెంట బల్దియా చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీల అధ్యక్షులు ఎర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, ఏంఎంసీ వైస్ చైర్మన్ దాసరి శ్రీనివాస్, కౌన్సిలర్లు నార్ల నందకిశోర్, బాడి శ్రీనివాస్, కిరణ్కుమార్, కో-ఆప్షన్ సభ్యులు తారా, అలీమొద్దీన్ బాబా, నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, రాజాగౌడ్, మహ్మద్ ఎజాస్, గురువినయ్కుమార్, మొగులయ్య, మోచి గణేశ్, కొర్ల పోతారెడ్డి, ముదిరెడ్డి విఠల్రెడ్డి, కనుకుట్ల రాజు, నరాల ఉదయ్గుప్తా, యూనుస్, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.