శక్కర్నగర్/రుద్రూర్, జూలై 19: బక్రీద్, ఊరపండుగలను శాంతియుతంగా, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవాలని బోధన్ ఏసీపీ రామారావు సూచించారు. బోధన్ పట్టణంలోని ఏఆర్ గార్డెన్లో పోలీస్శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ చట్టం పరిధిలో పండుగ లు నిర్వహించుకోవాలని, గోసంరక్షణ చట్టం నిబంధనలు పాటించాలని అన్నారు.
ఈ సమావేశంలో పట్టణ సీఐ రమన్, ఎస్సైలు విఠల్రావు, మోహన్రావు, టీఆర్ఎస్ పార్టీ బోధన్ పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహ్మన్, మైనార్టీ నాయకుడు ఎంఏ.రజాక్, రుద్ర సత్యనారాయణ, ఎంఐఎం అధ్యక్షుడు ముషీర్బాబా, బోధన్ మున్సిపల్ కౌన్సిలర్లు ఖదీర్ ఖాన్, గంగారాం, నాయకులు రామారాజు, ఎస్ఎస్ఆర్ కోటేశ్వర్ రావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు బాగారెడ్డి, ఖురేశీ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రుద్రూర్ మండలం సులేమాన్నగర్ లో తహసీల్దార్ ముజీబ్, ఎస్సై రవీందర్ సోమవారం పర్య టించారు. బక్రీద్ పండుగను ప్రశాంతంగా నిర్వహించుకు నేలా బాధ్యత తీసుకోవాలని గ్రామపెద్దలకు సూచించారు. సర్పంచ్ ఖాదర్, అఖిల్, లతీఫ్, గ్రామస్తులు పాల్గొన్నారు.