నిజాంసాగర్, జూలై 22: రాష్ట్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో సీఎస్ సోమేశ్కుమార్తో పాటు నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల మంత్రులు, కలెక్టర్లతోపాటు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే పాల్గొన్నారు. ఎగువన ఉన్న రాష్ర్టాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన, చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చర్చించారు. గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో వర్షపాతం నమోదు తీరు, ఎస్సారెస్పీ నుంచి మొదలుకొని కడెం, ఎల్లంపల్లి, స్వర్ణ, కాళేశ్వరం బ్యారేజీల పరిధిలో పరిస్థితిని అడిగి తెలుసు కున్నారు. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితిని సైతం ఎమ్మెల్యే హన్మంత్షిండేను అడిగి తెలుసుకున్నారు.