నిర్మల్ అర్బన్ : తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్ణణానికి చెందిన మాజీ కౌన్సిలర్ సింది లింగన్న టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్కు మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు టీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని అన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు రాంకిషన్ రెడ్డి, వైస్ చైర్మన్ సాజిద్, వివిధ వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి దవాఖానలో చికిత్సపొందుతున్న పలువురిని మంత్రి అల్లోల పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు దేవేందర్రెడ్డి, ప్రవీణ్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.