దస్తురాబాద్ : గ్రామాలలో మౌలిక వసతుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరంగా కృషి చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. మండలంలోని పెర్కపల్లె, మున్యాల తండా గ్రామాలలో బుధవారం ఆమె పర్యటించారు. పెర్కపల్లె గ్రామంలో నూతన పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. పాఠశాల విద్యార్థులకు మాస్కులను పంపిణీ చేశారు. మున్యాల తండా గ్రామంలోని జగదాంబ దేవీ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించి, మొక్కను నాటారు.
పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆమె అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సింగరి కిషన్, వైస్ ఎంపీపీ భూక్యా రాజు నాయక్, సర్పంచులు దుర్గం శంకర్, సీదర్ల భూమేశ్, నాగవత్ సురేశ్ నాయక్, అప్పని ప్రభాకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముడికే ఐలయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి అర్గుల రాజనర్సయ్య, నాయకులు రమేశ్ రావు, శ్రీనివాస్, రాజలింగం, శివయ్య, సత్తన్న, లక్ష్మిరాజం, రాజు, విలాస్ యాదవ్, నరేశ్, చందు నాయక్, గోపి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.