పెంబి : గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైనా సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని సంకల్పించడంతో వైద్య అధికారులు, సిబ్బంది వాగులు, వంకలు దాటి విధులను నిర్వహిస్తు శభాష్ అనిపించుకుంటున్నారు.గిరిజన గూడెంలలో్ శిబిరాలు నిర్వహించి కరోనా వ్యాక్సిన్పై అవగాహన పెంచుతూ టీకాలను వేస్తున్నారు. పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో ఆదివారం మారుమూల గిరిజన గ్రామమైన యాపల్గూడ గ్రామంలో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు.
అయితే ఆ గ్రామానికి వెళ్లాలంటే మధ్యలో కడెం వాగు దాటాలి. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కడెం వాగు ప్రవహిస్తున్నది. అయినా వైద్య సిబ్బంది వెనుదిరగక, వాగులో నడుస్తు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వాగుదాటి యాపల్గూడ గ్రామంలో వ్యాక్సినేషన్ చేశారు. తమ కోసం వాగు దాటివచ్చి వ్యాక్సిన్ వేసినందుకు ప్రజలు వైద్య సిబ్బందింని అభినందించారు. కార్యక్రమంలో పీహెచ్సీ మెడికల్ అధికారి నాగరాజు, ఎంపీవో చిక్యాల రత్నాకర్రావు, ఏఎన్ఎం సారిక, అంగన్వాడీ సిబ్బంది, ఆశవర్కర్లు, గ్రామస్తులు ఉన్నారు.