నిర్మల్ : నిర్మల్ జిల్లాలో అమానవనీయ ఘటన జరిగింది. కుబీర్ మండలం పల్సి గ్రామం శివారులో అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లిపోయారు.
అటుగా వెళ్తున్న మహిళ పొదల్లో ఆడ శిశువు ఏడుపు విని అధికారులకు సమాచారం అందించింది.
అక్కడి చేరుకున్న అధికారులు చిన్నారిని వైద్య పరీక్షల కోసం జిల్లా జనరల్ దవాఖానకు తరలించారు.
ఆడపిల్ల పుట్టడంతో తల్లిదండ్రులే శిశువును వదిలించుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. చికిత్స అనంతరం చిన్నారిని స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు సంరక్షించనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి