నిర్మల్: జిల్లాలోని తానూరు మండలంలో విషాదం నెలకొన్నది. మండలంలోని సింగన్గావ్లో ముగ్గురు బాలికలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సింగన్గావ్ చెరువులో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు సునీత (16), వైశాలి (14), అంజలి (14)గా గుర్తించారు. సునీత, వైశాలి అక్కా చెల్లెల్లు కాగా, అంజలి వారి సమీప బంధువు. నిన్న సాయంత్రం నుంచి ముగ్గురు బాలికలు కనిపించకుండా పోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదమా లేదా హత్యలా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.