లక్ష్మణచాంద, నవంబర్ 25 :నాణ్యమైన విద్యకు కేరాఫ్గా నిలుస్తున్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం క్యూ కడుతున్నారు. ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన సాగుతున్నది. దీంతో అడ్మిషన్లకు డిమాండ్ ఏర్పడింది. జిల్లాలోని 18 పాఠశాలలు, కళాశాలల్లో 4800 సీట్లు ఉండగా ప్రస్తుతం 5040 మంది విద్యార్థులు ఇప్పటికే చేరారు. పాఠశాల స్థాయిలో 3600 సీట్లు, జూనియర్ కళాశాలల్లో 1120 సీట్లు, ఉర్దూ మీడియంలో 80 సీట్లు ఉన్నాయి. నాణ్యమైన విద్యాబోధనతోపాటు పోషకాహారంతో మంచి భోజనం, కార్పొరే ట్ తరహాలో వసతులు కల్పిస్తున్నారు. దీంతో తమ పిల్లలకు పాఠశాలల్లో సీట్లు ఇవ్వాలని పోషకులు ప్రతి రోజూ ఆయా పాఠశాలలకు వస్తున్నారు. ఇప్పటికే ఉన్న సీట్ల కన్నా ఎక్కువ మందికి అడ్మిషన్ ఇచ్చామని ప్రత్యేక అధికారులు సమాధానమిస్తున్నారు.మధ్యలో చదువు మానేసిన విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కస్తూర్బా పాఠశాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో వివిధ పోటీ పరీక్షలతోపాటు, పదో తరగతిలోనూ జిల్లా స్థాయి ర్యాం కులు సాధిస్తున్నారు. ఉపాధ్యాయులు మరింత ప్రోత్సా హకరంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
జూనియర్ కళాశాలల్లో సీట్లకు డిమాండ్
కస్తూర్బా పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ప్రథమ ప్రాధాన్యతగా ఇంటర్లో సీట్లు కేటాయిస్తున్నారు. ఇతర పాఠశాలల్లో పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు కస్తూర్బాలో చదవడానికి ఆసక్తి చూపుతున్నారు. నిర్మల్ జిల్లాలోని 8 పాఠశాలల్లో జూని యర్ కళాశాలలు నడుస్తున్నాయి. నిర్మల్, దిలావర్పూర్, లక్ష్మణచాంద, మామడ, కడెం, సారంగాపూర్, భైంసా మండలాల్లోని పాఠశాలల్లో కళాశాలలు నడుస్తున్నాయి. వీటిలో దిలావర్పూర్, లక్ష్మణచాంద, సారంగాపూర్, భైంసా కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో విద్యను అందిస్తున్నారు. నిర్మల్, మామడ, కడెం కళాశాలలో సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులు నిర్వహిస్తు న్నారు. 8 కళాశాలలో ఏ ఒక్క సీటు ఖాళీ లేకపో వడం నాణ్యమైన విద్యకు నిదర్శనం.
ప్రైవేటుకు దీటుగా ఆంగ్లమాధ్యమం
కస్తూర్బా పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఆంగ్ల మాధ్యమంలో విద్యను బోధిస్తు న్నారు. నిర్మల్ జిల్లాలోని దస్తురాబాద్, పెంబి, సోన్, నిర్మల్ రూరల్, నర్సాపూర్(జీ) పాఠశాల ల్లో ఆంగ్లమాధ్యమంలో పాఠాలు చెబుతున్నారు. ఈ సంవత్సరమే నర్సాపూర్(జీ) పాఠశాల ఇంటర్మీడియట్ కళాశాలగా అప్గ్రేడ్ పొందింది. జాం, దిలావర్పూర్, మామడ, లోకేశ్వరంలోని జూనియర్ కళాశాలలో ఆంగ్లమాధ్యమంలో బోధిస్తున్నారు. జిల్లాలో 18 పాఠశాలలు ఉండగా 8చోట్ల ఇంటర్ విద్యను ప్రారం భించారు. ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన వారు తప్పని సరిగా కళాశాలల్లో చదవాలని జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేయడంతో విద్యార్థినుల చదువుకు ఆటంకం లేకుండాపోయింది.
రుచికర భోజనం.. సకల వసతులు
రుచికరమైన భోజనాన్ని ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్నది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం రెండు రకా ల కూరలు, సన్నబియ్యంతో కూడిన భోజనం, సాయం త్రం స్నాక్స్, రాత్రి మరో రెండు రకాల కూరలతో భోజ నాన్ని అందజేస్తున్నారు. ఆదివారం, బుధవారం చికెన్, మటన్ పెడుతున్నారు. అలాగే మెనూ ప్రకారం కోడి గుడ్లు ఇస్తున్నారు.
పాఠశాల పేరు నిలబెడుతా..
నేను 8వ తరగతి చదువుతున్నా. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహి స్తున్నారు. ఉపాధ్యా యులు అందుబా టు లో ఉంటున్నారు. దీంతో బోధన సందర్భంగా అనుమానాలు నివృత్తిచేస్తున్నారు. జిల్లాస్థాయి ర్యాంకు సాధిం చి పాఠశాల పేరు నిలబెడుతా.
తల్లిదండ్రులు లేని లోటును తీరుస్తున్నారు
మాది పొట్టపెల్లి(కే) గ్రామం చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. ఐదో తరగతిలో మా బంధువులు ఈ పాఠశాలో చేర్పించారు. తల్లిదండ్రుల వలే అన్ని అవసరాలను ఉపాధ్యాయులే చూసుకుంటున్నారు. కరోనా సమయంలో పాఠశాలలు నడవకపోవడంతో బంధువుల ఇండ్లలో ఉండి ఎంతో ఇబ్బందిపడ్డా. నా లాంటి వారికి ఈ పాఠశాలలు తల్లిదండ్రులు లేని లోటును తీరుస్తున్నాయి.
గౌతమి, ఏడో తరగతి విద్యార్థిని విద్యార్థులను సొంత పిల్లలుగా బావిస్తూ విద్యను అంది స్తున్నాం. మెనూ ప్రకారం భోజనం అందేలా చూస్తు న్నాం. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. వెనుకబడిన విద్యార్థు లపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. పాఠశాలల్లో అడ్మిషన్ కోసం చాలా పోటీ ఉంది. ఇదంతా సర్కారు చలవే. ఇప్పటి కే అడ్మిషన్లు పూర్తయ్యాయి. ఇంకా అడ్మిషన్ కోసం చాలా మంది పోషకులు వస్తున్నారు.
నవిత, కస్తూర్బా పాఠశాల ప్రత్యేకాధికారి(లక్ష్మణచాంద)