నిర్మల్: జిల్లాలోని నీలాయిపేట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకుపోతున్న బొలెరో వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో బొలెరోలో ప్రయాణిస్తున్నవారిలో ఒకరు మృతి చెందగా..మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే యాక్సిడెంట్ జరిగిందని భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..