నిర్మల్ : జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇటీవల బ్లాక్ ఫంగస్ కారణంగా చనిపోయారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నిర్మల్ జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ ధన్రాజ్ ఖండించారు. వారి మరణానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. బ్లాక్ ఫంగస్ వ్యాపించి చనిపోయారని ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికలపై జరుగుతున్న పుకార్లను ఆయన ఖండించారు. మృతుల కుటుంబ సభ్యులు కూడా ఈ ఆరోపణలను ఖండించారు. కొవిడ్-19తో చనిపోయినట్లుగా తెలిపారు. భైంసాకు చెందిన ఒకరు, కుబీర్ మండలానికి చెందిన మరొకరు కొవిడ్-19తో కొన్ని రోజులక్రితం గాంధీ ఆస్పత్రిలో చేరారు. వీరి గ్రామాలు మహారాష్ట్రకు దగ్గరగా ఉన్నందున బ్లాక్ ఫంగస్తో చనిపోయారని కొందరు ఆరోపిస్తూ పుకార్లను వ్యాపింపజేస్తున్నారు.