నిర్మల్ : అత్రుతగా చికెన్ బిర్యానీ తినేందుకు వెళ్లిన మున్సిపల్ కమిషనర్కు ఊహించని పరిణామం ఎదురైంది. చికెన్ ముక్కతోపాటు బొద్దింక రావడంతో ఆయన షాక్కు గురయ్యారు. వెంటనే సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హోటల్ను సీజ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రం శాంతినగర్లోని శ్రీలక్ష్మి గ్రాండ్ హోటల్లో ఈ సాయంత్రం మున్సిపల్ కమిషనర్ బిర్యానీ తినేందుకు వెళ్లారు. బిర్యానీ తింటుండగా చికెన్ ముక్కతోపాటు బొద్దింక వచ్చింది. దీంతో మున్సిపల్ కమిషన్ హోటల్ పరిసరాలను పూర్తిగా పరిశీలించారు. ఫ్రిడ్జ్లో బూజు పట్టిన స్థితిలో చికెన్ ఉండటాన్ని గుర్తించారు. కిచెన్లో అపరిశుభ్ర వాతావరణం నడుమ వంట చేస్తుండటంపై నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిని మందిలించి హోటల్ను సీజ్ చేశారు.