నిర్మల్ టౌన్, ఏప్రిల్ 25 : ప్రజా ఫిర్యాదులను తక్షణం పరిష్కరించి ఆర్జీదారులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 25 అర్జీలు రాగా ఆయా శాఖలకు అందజేసిన కలెక్టర్ వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేస్తామన్నారు. అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.
మలేరియా వ్యాధి నిర్మూలనకు చర్యలు
నిర్మల్ జిల్లాలో మలేరియా వ్యాధిని సమూ లంగా నిర్మూలించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మలేరియా నిర్మూలన కరపత్రా లు, ఫ్లెక్సీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్లెల్లో ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచు కోవాలని, దోమలు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వ్యాధి సోకిన వారికి ఉచితంగా వైద్య సేవలందించాలని సూచించారు. జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, సిబ్బంది అరుణ్, రవీందర్ పాల్గొన్నారు.