నిర్మల్ టౌన్, ఏప్రిల్ 25 : వేసవి కాలంలో మామిడి పండ్ల ధరలు మండిపోతున్నాయి. ఈసారి మామిడి తోటలకు తామర తెగులు సోక డంతో కాత ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో కాసిన మామిడికి మార్కెట్లో మంచి ధర లభిస్తు న్నా దిగుబడి లేక రైతులు ఆందోళన చెందుతు న్నారు. నిర్మల్ మార్కెట్లో మామిడి పండ్ల ధర భగ్గుమంటుంది. వారం రోజుల నుంచి నిర్మల్ మార్కెట్కు జగిత్యాల, జైపూర్, హైదరాబాద్ నుంచి బంగన్పెల్లితో పాటు రసాలు, లోకల్ మామిడి పండ్లను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. బంగన్పెల్లి మామిడి పండ్లు మార్కెట్లో రూ. 120 కేజీ లభిస్తుండగా.. లోకల్ మామిడి రూ. 150 -రూ. 160 కేజీ చొప్పున విక్రయిస్తున్నారు. కేజీకి 5 నుంచి 6 మామిడి పండ్లు వస్తుండడంతో ఒక్కొక్క మామిడి పండు ధర రూ. 30 వరకు పడుతుందని కొనుగోలు దారులు పేర్కొంటున్నా రు. సీజనల్లో లభించిన మామిడి పండ్ల రసాలు కోసం ధర ఎక్కువైనా కొనుగోలు చేయాల్సి వస్తుందని వారు పేర్కొంటున్నారు. ఇతర ప్రాం తాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల తమకు కూడా గిట్టుబాటు కావడం లేదని వ్యాపారులు వాపోతున్నారు.