ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
12వ వార్డులో రూ.70 లక్షలతో
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 18: రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 12వ వార్డులోని న్యూ హౌసింగ్ బోర్డులో రూ.25లక్షలతో బ్రిడ్జి నిర్మాణం, రూ.20లక్షలతో డ్రైనేజీలు, శ్రీనగర్ కాలనీలో రూ.25 లక్షలతో పైప్లైన్ పనులకు భూమి పూజ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల మున్సిపాలిటీలో విలీనమైన కాలనీలపై ప్రత్యేక దృష్టి నిలిపామన్నారు. మున్సిపల్ నిధులతో పాటు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ఎన్ని నిధులైనా తీసుకువస్తామని స్పష్టం చేశారు. ప్రజల కోసం సంక్షేమ పథకాలను కరోనా సమయంలోనూ దిగ్విజయంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు మున్సిపల్ చైర్మన్ తెలుసుకుని పరిష్కరిస్తుండడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్ జాదవ్ పవన్నాయక్, కాలనీవాసులు రుక్మారెడ్డి, తిరుమలేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
PL 2021: మాక్స్వెల్ మెరుపులు..28 బంతుల్లోనే ఫిఫ్టీ