ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 17: గిరిజన గ్రామాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ మండలంలోని మామిడికోరి, దహీగూడల్లో అంగన్వాడీ భవనం, సీసీ రోడ్ల పనులకు శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కోట్లాది నిధులతో గ్రామీణ ఆదివాసీ గూ డేలకు బీటీ రోడ్ల సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పా రు. మిషన్భగీరథ ట్యాంకులు ఏర్పాటు చేసి ఇం టింటికీ కనెక్షన్లు సురక్షిత నీరు అందిస్తున్నామని గుర్తు చేశారు. అర్హులైన గిరిజనులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త లు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, ఎంపీటీసీ జంగుపటేల్, వైస్ ఎంపీపీ రమేశ్, నాయకు లు సెవ్వ జగదీశ్, తదితరులు పాల్గొన్నారు.
రైతుబీమా చెక్కు పంపిణీ
జైనథ్, ఏప్రిల్ 17: మండలంలోని కాప్రి గ్రామానికి చెందిన మహిళా రైతు కుసుమ నర్మద ఇటీవ ల మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులకు రూ.5లక్షల విలువైన రైతుబీమా చెక్కును ఎమ్మె ల్యే జోగురామన్న శనివారం అందజేశారు. ఆయన వెంట రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఎస్ లింగారెడ్డి, నాయకుడు టీ వెంకట్రెడ్డి త దితరులు పాల్గొన్నారు.