రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డినిర్మల్ కలెక్టరేట్లో సమీక్షనిర్మల్ టౌన్, జూన్ 12 : రెండో దశ కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న తరుణంలో బ్లాక్ఫంగస్ వ్యాప్తిపై ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడంతోనే కేసులు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో శని వారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌ న్ విధించడం, అర్హులందరికీ కొవిడ్ టీకాలు వేయ డం, వైరస్ సోకిన వారికి ఉచితంగా వైద్యం అందించడంతో విజయం సాధించిందని తెలిపారు. నిర్మల్ జిల్లాలో బ్లాక్ఫంగస్ కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. ఇక్కడ ప్రస్తుతం కేవ లం ఐదు కేసులు మాత్రమే ఉన్నాయన్నారు. మొత్తం 14 కేసులు నమోదు కాగా.. నలుగురు చనిపోయారని, మరో 10 మంది కోలుకున్నారని తెలిపారు. జిల్లాలో వ్యాధి నియంత్రణకు వైద్యశాఖ చేసిన కృషిని ప్రశంసించారు. అనంతరం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై మంత్రి సమీక్ష చే శారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలో భూముల పారదర్శకత పాటించేందుకు డిజిటల్ భూసర్వే నిర్వహించనున్నదని తెలిపారు. సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామని తెలిపారు. ప్రభుత్వం ద్వారా అ మలు చేస్తున్న డబుల్బెడ్రూం ఇండ్లు, రైతుబంధు, రేషన్కార్డులు, రైతుబీమా, తదితర పథకాలపై సమీక్ష చేసి అధికారులకు సూచనలు, సలహాలు అందించారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, సి.రాంబాబు, జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి కిరణ్కుమార్, డీఆర్డీవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.వ్యాక్సినేషన్తోనే వైరస్ నిర్మూలననిర్మల్ అర్బన్, జూన్ 12 : కరోనా వైరస్ నిర్మూలన వ్యాక్సినేషన్తోనే సాధ్యమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సూపర్ స్ప్రెడర్లకు అందజేస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను కలెక్టర్ ముషారఫ్ అలీతో కలిసి శనివారం పర్యవేక్షించారు. వ్యాక్సినేషన్ కేంద్రంలోకి వెళ్లి సిబ్బందితో మాట్లాడారు. ప్రభుత్వం సూచించిన విధంగానే ప్రజలకు టీకాలు అందించాలని, సూపర్ స్ప్రెడర్లు ప్రతి ఒక్కరూ టీకా తీసుకునేలా చూడాలన్నారు. సూపర్ స్ప్రెడర్లను దేని ఆధారంగా గుర్తిస్తూ వ్యాక్సిన్ అందిస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నదని, ఇందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలో కరోనా వార్డులు పూర్తిగా ఖాళీ అయ్యాయన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నామని నిరక్ష్యం చేయవద్దని, భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. థర్డ్వేవ్ను సైతం ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా ఇన్చార్జి ఎస్పీ సీ.హెచ్ ప్రవీణ్ కుమార్, డీఎంహెచ్వో ధన్రాజ్, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ పాల్గొన్నారు.