నిర్మల్ టౌన్, మే 11 : నిర్మల్ జిల్లాలో ప్రభుత్వపరంగా చేపడుతున్న అభివృద్ధి పనులను వేగం గా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయంలో ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారుల ను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణంతోపాటు గ్రామీణాభివృద్ధి పథకాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో పల్లె ప్రగతి లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను లక్ష్యం మేరకు పూర్తి చేయాలని తెలిపారు. కొవిడ్ వైరస్ నియంత్రణపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
పట్టు పరిశ్రమ అభివృద్ధికి చర్యలు
జిల్లాలో పట్టు పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూ ఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఉద్యానవనం, పట్టు పరిశ్రమశాఖ పురోగతిపై జిల్లాస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో పట్టు పరిశ్రమ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని గ్రామాల్లో పట్టు పరిశ్రమను ప్రోత్సాహించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. పట్టు ఉత్పత్తులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకునేలా చూడాలని పేర్కొన్నా రు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్వో రమేశ్ రాథోడ్, సర్వే ల్యాండ్ రికార్డు అధికారి దశరథ్, తహసీల్దార్లు సుభాష్ చందర్, సం తోష్, తుకారాం, జిల్లా ఉద్యానవనశాఖాధికారి శరత్కుమార్, తదితరులున్నారు.