భైంసా, మే 8 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటా ఆరోగ్య సర్వేకు ప్రజలందరూ సహకరించాలని డీఆర్డీవో వెంకటేశ్వర్లు సూచించారు. శనివారం ఆయన పలు వార్డుల్లో సర్వే సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది కుటుంబసభ్యు ల సంఖ్య.. ఆరోగ్య సమస్యలు.. దీర్ఘకాలిక వ్యాధులు.. తాత్కాలిక వ్యాధులపై వివరాలు నమోదు చేస్తారని ప్రజలకు వివరించారు. ఆయన వెంట భైంసా హెచ్ఈవో ఖలీం, డాక్టర్ మతీన్, మున్సిపల్ కమిషనర్ అలీం, సిబ్బంది ఉన్నారు.
ఖానాపూర్ మండలంలో..
ఖానాపూర్ రూరల్, మే 8 : మండలంలోని పలు గ్రామా ల్లో ఇంటింటా ఆరోగ్య సర్వేకు వైద్య సిబ్బంది కదిలారు. కరో నా వైరస్ వ్యాప్తితో భయాందోళనకు గురవుతున్న ప్రజలకు కొండంతా ధైర్యాన్ని ఇస్తున్నారు. శనివారం బీర్నంది, తదితర గ్రామాలతోపాటు పట్టణంలోని శ్రీరాంనగర్లో ఇంటింటా సర్వే నిర్వహించారు. కుటుంబసభ్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన వారిని హోం ఐసొలేషన్ ఉండాలని సూచించి కిట్లను అందజేశారు. వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. కార్యక్ర మం లో ఆరోగ్య బోధకురాలు జయలత, ఆశ కార్యకర్తలు భారతి, భాగ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.