లక్ష్మణచాంద : ఎన్నికల్లో కుదిరిన ఒప్పందం మేరకు నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద ఎంపీపీ అధ్యక్షురాలు కేశం లక్ష్మి బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ సీఈవో సుధీర్ కుమార్కు ఆమె తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆమె రాజీనామాతో వైస్ ఎంపీపీ కల్పనారాంరెడ్డికి ఎంపీపీగా బాధ్యతలు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. 2019 సంవత్సరంలో ఎంపీపీ ఎన్నిక సమయంలో కుదిరిన ఒప్పందం ప్రకారం మల్లాపూర్ ఎంపీటీసీ కేశం లక్ష్మికి రెండున్నర సంవత్సరాలు, లక్ష్మణచాంద ఎంపీటీసీ అడ్వాల పద్మకు మరో రెండున్నర సంవత్సరాలు ఎంపీపీ పదవి పంచుకోవాలని టీఆర్ఎస్ నాయకుల సమక్షంలో ఒప్పందం కుదిరింది.
ఒప్పందంలో భాగంగానే కేశం లక్ష్మి రాజీనామ చేసినట్లు నాయకులు వెల్లడించారు. త్వరలో అడ్వాల పద్మ ఎంపీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ రఘునందన్ రెడ్డి, టీఆర్ఎస్ మండల ఇన్చార్జి అల్లోల సురేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొరిపెల్లి కృష్ణారెడ్డి తదితరులున్నారు.