నిర్మల్ జిల్లా, పెంబి మండలం, చాకిరేవు గూడానికి తక్షణమే నీటి వసతి, మౌలిక సదుపాయాలు కల్పించాలని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదేశించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తండాలు పంచాయతీలుగా మారి అన్ని వసతులు సమకూరుతున్న తరుణంలో ఇంకా మంచి నీటి కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం నిర్మల్ కలెక్టర్ కార్యాలయం చేరుకోవడానికి గూడెం వాసులు 75 కిలోమీటర్లు నడిచి రావడం బాధాకరమన్నారు. వెంటనే గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఆ గూడెం సందర్శించి, తాగునీరు, విద్యుత్, ఇతర సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.