నిర్మల్ అర్బన్ : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మడిపెల్లి భద్రయ్య శనివారం మృతి చెందిన విషయం విదితమే. ఆదివారం నిర్మల్ పట్టణంలో నిర్వహించిన అంత్యక్రియల్లో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. భద్రయ్య పార్థివ దేహంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఉపాధ్యాయుడిగా ఉత్తమ బోధనలు అందించడంతో పాటు తన రచనల ద్వారా ప్రజలను చైతన్యపరిచని భద్రయ్య మరణం తీరనిదని ఆయన అన్నారు.