నిర్మల్ : ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కరోనా బారిన పడ్డారు. ఆమెకు ఆదివారమే కొవిడ్-19 పాజిటివ్గా తేలగా విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లుగా, ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.