కడెం : జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కడెం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 700 అడుగులు (7.603టీఎంసీలు) వద్ద ఉంది. ఆదివారం కడెంకు ఎగువ ప్రాంతాల నుంచి 5383 క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో అధికారులు ఒక వరదగేటును ఎత్తి 4178 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
కాగా, కుడి కాలువ ద్వారా 14 క్యూసెక్కులు, ప్రధాన కాలువ ద్వారా 826 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు వారు తెలిపారు.