బాసర/ నిర్మల్ అర్బన్ : బాసర శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఈ నెల 7 నుంచి నిర్వహించే దసరా నవరాత్రి ఉత్సవాలకు రావాలని ఆదివారం ఆలయ అర్చకులు మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి ఆహ్వానాన్నిఅందజేశారు. ఆలయ ఈవో వినోద్రెడ్డి, అర్చకులు మంత్రిని కలిసి అమ్మవారి ప్రసాదంతో పాటు దసరా నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
అదేవిధంగా సారంగపూర్ మండలం అడెల్లి గ్రామంలో కొలువైన మహాపోచమ్మ దేవస్థానం అమ్మవారి గంగనీళ్ల జాతర ఆహ్వాన పత్రాన్ని అడెల్లి ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి అందించారు. ఈనెల 10న జరుగనున్న జాతర ఏర్పాట్ల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చందు, మార్కెట్ కమిటీ చైర్మన్ వంగ రవీందర్ రెడ్డి, ఎంపీపీ మహిపాల్ రెడ్డి, వెంకట్ రాంరెడ్డి, దేవేందర్ రెడ్డి, సుభాష్ రావు, రాంకిషన్ రెడ్డి తదితరులున్నారు.