నిర్మల్ : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో 5 వరోజు శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం స్కంధమాత అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి పెరుగు అన్నం, (దద్దోజనం) నైవేద్యంగా సమర్పించారు. కాగా, శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించేలా ఆలయ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుంది.