ఖానాపూర్టౌన్ : మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన 20 మంది బీజేపీ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ఆధ్వర్యంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులమై బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరినట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాల్ చైర్మన్ అంకం రాజేందర్, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, మండల అధ్యక్షుడు రాజగంగన్న, కొక్కుల ప్రదీప్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు