దస్తురాబాద్ : మండలంలోని ఎరగుంట గ్రామంలో శుక్రవారం పోలీసు, ఎక్సైజ్ శాఖ ఎస్ఐలు రాల్ గైక్వాడ్, జె.రమేశ్ నాయక్ ఆధ్వర్యంలో గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో 10 లీటర్ల గుడుంబా, 600 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు.
అక్రమంగా గుడుంబా తయారు చేసినా, అమ్మినా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పోలీసు, ఎక్సైజ్ శాక సిబ్బంది రజిత, లక్ష్మణ్, విఠల్, దినేష్, చంద్రశేఖర్, రాజశేఖర్, రవీందర్, ప్రశాంత్, కల్పన తదితరులు పాల్గొన్నారు.