వైద్యులు నాణ్యమైన సేవలందించాలి
ఆదిలాబాద్ ఇన్చార్జి కలెక్టర్ రాహుల్రాజ్
వైద్యాధికారులతో సమావేశం
ఎదులాపురం, ఏప్రిల్ 28 : జిల్లాలోని కరోనా బాధితులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు ఆదిలాబాద్ ఇన్చార్జి కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. కలెక్టరేట్లో బుధవారం వైద్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొవిడ్ సోకి ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలకు వచ్చే బాధితులకు వైద్యులు సకాలంలో వైద్యం అందించి, ప్రాణాలు కాపాడాలన్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్, రెమ్డెసివిర్ అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లే బాధితులకు అందుతున్న వైద్యసేవలను పర్యవేక్షించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్ను ఆదేశించారు. ప్రస్తుతం ప్రైవేట్ దవాఖానల్లో ఐదుగురు క్రిటికల్గా ఉన్నవారి వివరాలను, వారి ఆరోగ్య స్థితిగతులను తెలియపర్చాలన్నారు. అలాగే ప్రైవేట్ దవాఖానల్లో 24 మంది రోగులు ఆక్సిజన్ సేవలు పొందుతున్నవారి పూర్తి వివరాలను సమర్పించాలని సూచించారు. రెమ్డెసివిర్ అందుబాటులో లేనప్పుడు ప్రైవేట్ దవాఖానల్లో బాధితులను చేర్చుకోకుంటే తెలియజేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ దవాఖానల్లో 81 మంది కరోనా బాధితులు వైద్యసేవలు పొందుతున్నారని తెలిపారు.
ఏ దవాఖాన నుంచి వస్తున్నారన్నది, రోగి పూర్వాపరాలను తెలుసుకోవాలన్నారు. క్లిష్టమైన పరిస్థితుల్లో బాధితులు రిమ్స్కు వస్తున్నారని, ఆరోగ్య పరిస్థితులు క్షీణించడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని రిమ్స్ డైరెక్టర్ తెలిపారు. రిమ్స్లో ప్రస్తుతం 64 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని, అందులో 41 మందికి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇస్తున్నామని వెల్లడించారు. ఐదుగురి ఆరోగ్యం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నదని తెలిపారు. కాగా, వారి పూర్వాపరాలు తెలుసుకొని వైద్యం అందించాలని కలెక్టర్ సూచించారు. మూడురోజుల్లో 13 మరణాలు సంభవించాయ ని, ఇక ముందు అలా జరుగకుండా వైద్యం అం దించాలన్నారు. అర్హులందరికీ టీకా అందేలా చర్య లు చేపట్టాలని సూచించారు. రిమ్స్లో ఆర్టీపీసీఆ ర్ పరీక్షల నిర్వహణకు యుద్ధ ప్రాతిపదికన ప నులు చేపట్టాలని రిమ్స్ డైరెక్టర్ను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కు కావాల్సిన పనులను నాలుగైదు రోజుల్లో పూర్తిచేయాలని ఫోన్ ద్వారా సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎం డేవిడ్, ఆర్డీవో జాడే రాజేశ్వర్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ బానోత్ బలరాం నాయక్, ఉట్నూర్ సీహెచ్సీ ఇన్చార్జి పర్యవేక్షకుడు దీపక్ పుష్కర్ తదితరులు పాల్గొన్నారు.