అన్ని శాఖల నివేదికలను ప్రభుత్వానికి అందించాలి
విపక్షాలు విమర్శలు మానుకొని సేవ చేయండి
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
నిర్మల్ టౌన్, జూలై 26: జిల్లాలో మూడు రోజుల క్రితం రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షం కారణంగా వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని రా ష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. వర్షం, వరదల నష్టం అంచనాలపై జిల్లా ఉన్నతాధికారుల సమావేశాన్ని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, వ్యవసాయం, విద్యుత్, పంచాయతీరాజ్, ఉద్యానవనం, ఆర్అండ్బీ, మున్సిపల్, మిషన్ భగీరథ, జలవనరులశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నష్టం అంచనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లాలో రికారు ్డస్థాయిలో 24 గంటల్లో 34 సెంటీమీటర్ల వర్షం కురియడంతో, భారీ వరదలు వచ్చి నిర్మల్, భైంసా మున్సిపాలిటీతో పాటు కడెం మండలంలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లిం దన్నారు. 24వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయశాఖ అధికారులు తెలుపగా, విద్యుత్శాఖకు రూ. 2కోట్ల నష్టం వచ్చిందని సంబంధిత అధికారులు వివరించారు.
మున్సిపల్శాఖకు రూ. 10కోట్లు, ఆర్అండ్బీకి రూ. 4కోట్లు, పంచాయతీరాజ్కు రూ. 3 కోట్ల్ల న ష్టం జరిగిందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించడం తోనే ప్రజల ప్రాణాలు రక్షించగలిగామన్నారు. నిర్మల్లో కురిసిన వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి సోమేశ్కుమార్ల దృష్టికి తీసుకెళ్లగా.. నిర్మల్కు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపారని పేర్కొన్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, మత్స్య కారులు వరదల్లో ప్రాణాలను లెక్క చేయకుండా నీటిలో మునిగిన వారిని కాపాడారని, సీఎం కేసీఆర్ ప్రశంసిం చారని గుర్తు చేశారు. వరదలతో నష్టపోయిన రోడ్లు, ఇండ్లు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను పునరుద్ధరించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. భైంసా మండలంలోని గుండెగాం గ్రామస్తులకు పునరావాసం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలను ప్రారంభించిందని తెలిపారు.
విమర్శలు మాని సేవా కార్యక్రమాలు చేయండి
వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుకునేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు నిమగ్నమై ఉంటే, కాంగ్రెస్ నాయకులు విమర్శలకే పరిమితమయ్యారని మండి పడ్డారు. వరదల్లో చిక్కుకున్న ఏ ఒక్క బాధితుడినైనా కాంగ్రెస్ నాయకులు కాపాడారా అని సూటిగా ప్రశ్నించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవా ల్ విసిరారు. ఆపత్కాలంలో ఆదుకున్న తమపై బురద చల్లితే, ఆ బురదలోనే కాంగ్రెస్ నాయకులు కొట్టుకుపోతారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పక్కదారి పట్టించేలా కొన్ని పత్రికలు త ప్పుడు వార్తలు రాస్తున్నాయని మండిపడ్డారు. విపక్షా లు విమర్శలు మాని సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని హితవు పలికారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి మాట్లాడుతూ గుండెగాం బాధితులను ఆదుకుంటున్నామని, దీనిపై కొన్ని పత్రికలు అసత్య వార్తలు రాస్తూ ప్ర జలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రాంబాబు, డీఆర్వో రమేశ్ రాథోడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్రావు, అధికారులు తు కారాం, రమేశ్ రాథోడ్, అంజిప్రసాద్, సుశీల్కుమార్, రామారావు, మధుసూదన్రావు, శ్రీనివాస్రెడ్డి, శరత్బాబు, అశోక్కుమార్, శంకరయ్య, సంతోష్, నాగేశ్వర్రావు, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, అంకం రా జేందర్, భైంసా మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మ ద్, తహసీల్దార్లు సుభాష్చందర్, జాకీర్ హుస్సేన్ పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన కేంద్రె బాలాజీ
నిర్మల్ అర్బన్, జూలై 26: రైతులు అధునాతన సాగు పద్ధతులను అవలంబించినట్లయితే అధిక దిగుబడి, అ ధిక ఆదాయం సాధ్యమవుతుందని మంత్రి అల్లోల ఇం ద్రకరణ్ రెడ్డి అన్నారు. కెరమెరిలో తాను పండించిన ఆ పిల్ పండ్లను సోమవారం క్యాంపు కార్యాలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ఆదర్శ రైతు బాలాజీ అందజేశారు.