నేలకొరిగిన 600 స్తంభాలు
కొట్టుకపోయిన 80 ట్రాన్స్ఫార్మర్లు
50 గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం
నిర్మల్ టౌన్, జూలై 23 : రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో ట్రాన్స్కోకు భారీ నష్టం వాటిల్లింది. జిల్లాలో రికార్డుస్థాయిలో వర్షం కురవడంతో గోదావరి నది పరీవాహక ప్రాంతం తో పాటు కడెం, స్వర్ణ, గడ్డెన్న వాగుతో పాటు నదులు, వాగుల దగ్గర ఉన్న 600 స్తంభాలు పూర్తిగా పడిపోయినట్లు ట్రాన్స్కో ఎస్ఈ జయంత్రావుచౌహన్ తెలిపారు. కడెం పరివాహక ప్రాం తంలోని పెంబి, ఖానాపూర్ రూరల్ పరిధితో పాటు నిర్మల్, సోన్ మండలాల్లోని మాదాపూర్, జాఫ్రాపూర్, చిట్యాల్, కుంటాల మండలం అందకూర్, కుంటాల, ఓలా, భైంసా గడ్డెన్నవాగు పరివాహక ప్రాంతంలో ఎక్కువ నష్టం వాటిల్లినట్లు వివరించారు. దిలావర్పూర్, సారంగాపూర్ మం డలాల్లో స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు వరదలో కొట్టుకుపోయాయని తెలిపారు. 80 ట్రాన్స్ఫార్మర్ల వరకు వరదలో కొట్టుకుపోగా, జిల్లాలో సుమారు రూ. కోటి వరకు నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలో తేలిందన్నారు. వర్షం కారణంగా సు మారు 50 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపో గా.. ఆ ప్రాంతాల్లో ట్రాన్స్కో సిబ్బంది శుక్రవారం పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నారని వివరించార. మరో 12 గంటల్లో అన్ని గ్రామాల్లో సరఫరాను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అన్ని మండలాల్లో ఏఈల ఆధ్వర్యంలో నష్టంపై ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు వివరించారు.
పునరుద్ధరణ చర్యలు వేగవంతం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, చెరువులకు జరిగిన నష్టాన్ని పూర్తిగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు జలవనరులశాఖ ఆదిలాబాద్ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలోని సరస్వతీ కెనాల్తో పాటు 27ప్యాకేజీలో వరదతో వల్ల దెబ్బతిన్న కాలువలను జిల్లా అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. సరస్వతీ మెయిన్ కెనాల్తోపాటు ఉప కాలువలకు మూడు చోట్ల గండ్లు పడ్డాయని, చాలా ప్రాంతాల్లో మట్టి కూడుకపోయిందన్నారు.
వాటిని తొలగించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నీటి పారుదలశాఖకు భారీగా నష్టం జరిగినట్లు జలవనరులశాఖ జిల్లా పర్యవేక్షక ఇంజినీర్ సుశీల్కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామారావు తెలిపారు. నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల్లో సుమారు 25 చెరువులకు గండ్లు పడ్డాయని, మరో 20 చెరువుల కాలువలు కొట్టుకపోయినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు చెప్పారు. అన్ని గ్రామాల్లో ఏఈల పర్యవేక్షణలో ప్రాథమికంగా సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని వివరించారు. సరస్వతీ కెనాల్కు రూ. 50లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు చెప్పారు. 27 ప్యాకేజీ పనుల్లో వరద చేరడంతో ఇసుక మేటలు వేశాయని ప్రాథమికంగా గుర్తించినట్లు వివరించారు. ప్రమాదం పొంచి ఉన్న చెరువులన్నీ ముందే గుర్తించి, గ్రామస్తుల సహకారంతో అలుగు ద్వారా వరదను పంపించే ఏర్పా ట్లు చేసినట్లు చెప్పారు. గండ్లు పడిన ప్రాంతాలను శుక్రవారం సందర్శించినట్లు తెలిపారు.