మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి,ఎమ్మెల్యేలు జోగు రామన్న, జీ విఠల్రెడ్డి
సారంగాపూర్, జూలై 23: రెండు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలను ఆదుకుంటామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని గోపాల్పేట్, బోరిగాం, దుర్గానగర్, మల్లక్చించోలి, వంజర్ గ్రామాల్లో భారీ వర్షాలకు నష్టపోయిన వంతెనలు, రోడ్లను మంత్రి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారీ వర్షాలకు వంతెనలు, చెరువులు, కల్వర్టులు, రోడ్లు తెగిపోయాయన్నారు. మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో టీ ఫైబర్ కేబుల్ మూలంగా రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని, వెంట నే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. పంటలు కూడా దెబ్బతిన్నాయని, రైతులు అధైర్య పడవద్దని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు నల్లావెంకట్ రాంరెడ్డి, మార్కెట్ చైర్మన్ వంగ రవీందర్రెడ్డి, ఆలూర్ సొసైటీ చైర్మన్ మాణిక్రెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, టీఆర్ఎస్ పార్టీ మం డల కన్వీనర్ మాధవరావు, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ముద్రం దినేష్, మల్లయ్య,రాజు,గంగారెడ్డి, రాంరెడ్డి, రవీందర్ పాల్గొన్నారు.
సోన్, జూలై 23: మండలంలోని జాఫ్రాపూర్, మాదాపూర్లో ధ్వంసమైన రోడ్లను, నీట మునిగిన పంటల ను మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పరిశీలించారు. జడ్పీటీసీ జీవన్రెడ్డి, మంజులా పూర్ పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్రెడ్డి, మాజీ ఎఫ్ఏసీఎస్ ఛైర్మన్ రాంకిషన్రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు టీ వినోద్కుమార్, సర్పంచ్లు కొరిపెల్లి సునీత ప్రకాశ్రెడ్డి, రాజనర్సింహారెడ్డి, ఎల్చల్ గంగారెడ్డి, రైతు బం ధు సమితి మండల కన్వీనర్ మహేందర్రెడ్డి పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, జూలై 23: ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్నగర్ కాలనీలో ఎమ్మెల్యే జోగు రామన్న శుక్రవారం ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో రెండు రోజులుగా వరద నీటితో ఏర్పడిన ఇబ్బందులను తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతిలో కాలనీల వారీగా సమస్యలు గుర్తించామని, త్వరలోనే వీటిని పరిష్కరించడానికి ఏర్పా ట్లు చేస్తున్నామన్నారు. సంజయ్ నగర్ అభివృద్ధికి ఇప్పటి వరకు రూ. 2కోట్లు వెచ్చించినట్లు వివరించారు. మరో రూ.50లక్షలు మున్సిపల్ నుంచి విడుదల చేయిస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు శివాలయంలో ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పూజలు చేశారు. కౌన్సిలర్ సుజాత, కమిషనర్ శైలజ, ఈఈ వెంకట శేషయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్, నాయకులు శైలేందర్, సృజ న్,వెంకన్న, లక్ష్మణ్, పోతారెడ్డి, గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
వరద నష్టం పరిశీలన
కుంటాల/లోకేశ్వరం, జూలై 23 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, చెరువులు, రహదారులతో పాటు అర్లీ బ్రిడ్జిని ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి పరిశీలించారు. కల్లూర్,చాక్పెల్లి, అందకూర్లో తెగిపోయిన చెరువులు, రహదారులను పరిశీలించిన ఎమ్మెల్యే తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. యుద్ధప్రతిపాదికన మరమ్మతులు చేపట్టేం దుకు సంబంధిత శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్య టించి పూర్తి స్థాయిలో నివేదికలు అందించాలని ఆదేశించారు. దెబ్బతిన్న పంటల ను గ్రామాల వారీగా వ్య వసాయాధికా రులు సర్వే చేస్తున్నారని తెలిపారు. వర్షాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు.నాయకులు నర్సింగ్ రావు, రమేశ్ రెడ్డి, డాక్టర్ భోజన్న, దశరథ్, సుధాకర్, నవీన్ రెడ్డి, దత్తు ఉన్నారు. అర్లీ బ్రిడ్జిని మండల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. నూతన వారధి నిర్మాణం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన వెట ఎంపీపీ లలితా భోజన్న, ఎంపీడీవో గంగాధర్, సర్పంచ్లు భుజంగ్ రావు, శేఖర్ రెడ్డి, సవిత నర్సింగ్ రావు, ఎంపీటీసీలు ఉన్నారు.