మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీఎం
క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశం
వరద ్రప్రాంతాల్లో మంత్రి పర్యటన
నిర్మల్కు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
బాలింతను, యువకుడిని రక్షించిన రెస్క్యూ టీం
నిర్మల్ అర్బన్, జూలై 22 : ఎడతెరిపిలేని వర్షాల వల్ల నిర్మల్లోని వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీఎం అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం ఆస్తి నష్టం జరుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్య లు తీసుకోవాలని సూచించారు. మరో 24 గంట ల పాటు అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చోట యుద్ధ్దప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. సహాయక చర్యలు చేపట్టడానికి నిర్మల్కు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతామని పేర్కొన్నారు.
మంత్రి సుడిగాలి పర్యటన..
జలదిగ్భందంలో చిక్కుకున్న జీఎన్ఆర్ కాలనీని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సందర్శించారు. బాలింత, 11 రోజుల వయస్సున్న బాబు,యువకుడిని రెస్క్యూ టీం సహాయంతో రక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఇం తటి వర్షం కురవలేదని, ఎడతెరపి లేని వర్షాల వల్ల నిర్మల్ పట్టణం చుట్టూ వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయన్నారు. సుమా రు 300 మంది జలదిగ్బంధంలో చిక్కుకున్నారని గజ ఈతగాళ్లు, రెస్క్యూ టీంలతో సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నామని పేర్కొన్నారు. పలు కాలనీల్లోకి భారీగా వరద వచ్చి చేరిందని, ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించండి
నిర్మల్ టౌన్, జూలై 22 : వర్షాల నేపథ్యం లో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం జిల్లా కార్యాలయంలో అధికారులను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపా రు. అధికారులను అప్రమత్తం చేసి అవసరమైన సాయం అందించేందుకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆదేశాల మేరకు యుద్ధ్దప్రతిపాదికన చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిర్మల్, భైం సా, ఖానాపూర్ మున్సిపాలిటీతోపాటు ఆయా మండలాల్లో ఇండ్లల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకువస్తున్నామని తెలిపారు. విద్యుత్, నీటిపారుదల, అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశామని వివరించారు. వర్షాల వల్ల ఎవరికి ఏ హాని జరుగకుండా జిల్లా యంత్రాంగం పూర్తి భరోసా కల్పిస్తున్నదని తెలిపారు.