న్యూఢిల్లీ: కరోనా కేసులు వెలుగుచూడటంతో భారత్, శ్రీలంక మద్య జరుగాల్సిన వన్డే సిరీస్ను రీషెడ్యూల్ చేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య ఈ నెల 13న తొలి వన్డే జరుగాల్సి ఉండగా.. శ్రీలంక బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్తో పాటు సహాయ సిబ్బందిలో మరొకరికి కొవిడ్-19 పాజిటివ్గా తేలడంతో.. మొదటి మ్యాచ్ను ఈ నెల 17కు తరలించారు. రెండు దేశాల బోర్డుల మధ్య చర్చలు జరిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ అధికారి శుక్రవారం తెలిపారు.