ధర్మారం/బుగ్గారం జూలై 7: ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతితో గ్రామాల్లో ఆరోగ్యకర వాతావరణం ఏర్పడిందని, నిత్య పారిశుధ్య కార్యక్రమాలతో వ్యాధులు దూరమవతున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కటికెనపల్లి, బొమ్మారెడ్డిపల్లి, జగిత్యాల జిల్లా బుగ్గారం మండ లం చిన్నాపూర్లో బుధవారం నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కటికెనపల్లిలో పెద్దపల్లి కలెక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి మొక్కలు నాటారు. తీరొక్క మొక్కలతో పల్లెప్రకృతివనాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారని సర్పంచ్ రాజయ్యను మంత్రి అభినందించారు. పూల తోటలో ఫొటోలు దిగారు. బొమ్మారెడ్డిపల్లి పల్లెప్రకృతి వనంలో మొక్కలు నాటే కార్యక్రమా న్ని ప్రారంభించారు.
అనంతరం ధర్మారంలో షా పింగ్ కాంప్లెక్స్లకు శంకుస్థాపన చేశారు. బుగ్గారం మండలం చిన్నాపూర్లో మొక్కలు నాటడంతో పాటు సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. దివ్యాంగులకు సబ్సిడీ రుణ మంజూరు పత్రాలు అందించారు. ఈసందర్భంగా మంత్రి ఆయాచోట్ల మాట్లాడారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖ లు మారాయన్నారు. మొక్కల సంరక్షణకు చర్య లు తీసుకుంటున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకా రం చుట్టిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కిందన్నారు. గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు వేగంగా సాగుతున్నాయని పెద్దపల్లి కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ ము త్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ఎంపీడీవో జయశీల, తహసీల్దార్ వెంకటలక్ష్మి, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకటరెడ్డి, ఏఎఎంసీ చైర్మ న్ గుర్రం మోహన్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, జిల్లా సహకార అధికారి మైకేల్ బోస్, వైస్ ఎంపీపీ మేడవిని తిరుపతి, సర్పంచు లు గాగిరెడ్డి ప్రేమలతారెడ్డి, పూస్కూరు జితేందర్రావు, ఎంపీటీసీలు సూరమల్ల శ్రీనివాస్, గాగిరెడ్డి వేణుగోపాల్రెడ్డి, తుమ్మల రాంబాబు, ఉప సర్పంచులు రామడుగు గంగారెడ్డి, బత్తిని తిరుప తి, ఆవుల లత, వార్డు సభ్యులు, ఆర్బీఎస్ మండ ల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, జిల్లా సభ్యుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ధర్మారం కేడీసీసీబీ మేనేజర్ సునీత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంచా ల రాజేశం, ప్యాక్స్, ఏఎంసీ వైస్ చైర్మన్లు సామంతుల రాజమల్లు, గూడూరి లక్ష్మణ్, ఎంపీటీసీల, ఉపసర్పంచుల, వార్డుమెం బర్ల ఫోరం మండలాధ్యక్షులు మిట్ట తిరుపతి, మంద శ్రీనివాస్, ఎండీ షరీఫ్ ఉన్నారు.