మనోహరాబాద్, జూలై 7 : గ్రామాలాభివృద్ధి కోసమే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని డీపీవో తరుణ్కుమార్ అన్నారు. శివ్వంపేట మండలం దొంతి, మగ్ధుంపూర్, శివ్వంపేట గ్రామాల్లో బుధవారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్యార్డులతోపాటు పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇంటింటికీ తిరుగుతూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. పల్లెలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సైతం కృషి చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు తడి, పొడి చెత్తపై ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పబ్బా మహేశ్గుప్తా, సర్పంచ్లు శ్రీనివాస్గౌడ్, ఫణిశశాంక్, ఎంపీడీవో నవీన్కుమార్ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి..
వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 4వ విడుత పల్లెప్రగతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మండల కేంద్రమైన మాసాయిపేటలో పల్లెప్రగతి పనులను తూప్రాన్ డీఎల్పీవో వరలక్ష్మి పరిశీలించారు. ఇంటి వద్ద మొక్కలను నాటాలని ప్రజలు సూచించారు. చర్లపల్లి, దామరంచ గ్రామాల్లో సర్పంచ్లు, కార్యదర్శులు మహిళలకు ఇంటి వద్ద నాటే మొక్కలను పంపిణీ చేయగా, మంగళపర్తిలో ట్రాక్టర్ డోజర్తో పలు వీధుల్లో మట్టిరోడ్లు, ఖాళీ స్థలాలను శుభ్రం చేశారు. కొప్పులపల్లిలో చెట్లు, ముళ్లపొదలను తొలగించగా, కుకునూర్, బొమ్మారం గ్రామాల్లో రోడ్లు, మురికి కాల్వలను శుభ్రం చేశారు. శంశిరెడ్డిపల్లితండాలో, రామంతాపూర్లో హరితహారం మొక్కలు నాటేందుకు గోతులను తవ్వి, మొక్కలు నాటారు.
డంపింగ్యార్డు, ప్రకృతి వనాల పరిశీలన
చేగుంటలో తూప్రాన్ డీఎల్పీవో వరలక్ష్మి పర్యటించారు. పల్లె ప్రగతిలో భాగంగా బుధవారం చేగుంటలోని డంపింగ్యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలను పరిశీలించి పల్లె ప్రకృతిలో తీసుకోవాల్సిన పలు అంశాలను డీఎల్పీవో వివరించారు. కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, ఎంపీవో ప్రశాంత్, ఈవో రాణి, పంచాయతీ సిబ్బంది స్వామి, వార్డు సభ్యులు ఉన్నారు.
పల్లె ప్రగతిలో భాగంగా నార్సింగి మండల పరిధిలోని భీంరావ్పల్లి గ్రామంలో సర్పంచ్ కాపు ఎల్లమ్మ, వార్డు సభ్యుడు బోయిని భూషణం గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు. మండల కేంద్రమైన చేగుంటలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్ మురికి కాల్వల చెత్తను ట్రాక్టర్లలో వేసి తరలించారు.
రూపురేఖలు మారుతున్నాయి
పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు అన్నారు. బుధవారం మండలంలోని నస్కల్లో నిర్వహిస్తున్న పల్లె ప్రగతి పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. పల్లెప్రగతి పనులలో భాగంగా గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడం, శిథిలావస్థకు చేరిన ఇండ్ల తొలగింపు వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని, మండల అభివృద్ధి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి సర్పంచ్ కవిత, పంచాయతీ కార్యదర్శి ప్రేమలత, వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.
గ్రామస్తులు తమ ఇంటి ఆవరణలో చెత్త వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల ప్రత్యేకాధికారి విజయలక్ష్మి అన్నారు. బుధవారం ఆమె మండలంలోని కల్వకుంట, వెంకటాపూర్(కె), తిప్పన్నగుల్ల, జడ్చెరువు తండాలో పర్యటించి పల్లె ప్రగతి పనులను పరిశీంచారు. పల్లెప్రగతి పనులతో గ్రామాలు సుందరంగా మారుతున్నాయని అన్నారు. ఎంపీవో రాజేందర్, గ్రామ ప్రత్యేకాధికారి భిక్షపతి, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు ఉన్నారు.