ముంబై: అలనాటి బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ మృతికి అన్ని వర్గాల నుంచి సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా వివిధ రంగాల ప్రముఖులు దిలీప్ కుమార్ ఇంటికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. ఆయన సతీమణి సైరాబానును పరామర్శిస్తున్నారు. బాలీవుడ్కు చెందిన ప్రముఖ హీరోలు షారూఖ్ ఖాన్, అనిల్ కపూర్ కూడా దిలీప్ కుమార్ ఇంటికి చేరుకుని సైరాబానును పరామర్శించారు.
నటుడు దిలీప్ కుమార్ (98) గత కొంతకాలంగా శ్వాస సంబంధ సమస్యలతో ముంబైలోని హిందూజా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం 7.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన 1922 డిసెంబర్ 11న పాకిస్థాన్లోని పెషావర్లో జన్మించారు. 1944 నుంచి 1998 వరకు చిత్రసీమను ఏలిన దిలీప్ కుమార్ ఉత్తమ నటుడిగా ఎనిమిది సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు పొందారు. 1994లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు.
సినీ పరిశ్రమకు చేసిన సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం కూడా దిలీప్ కుమార్కు 1991లో పద్మభూషణ్ పురస్కారం అందజేసింది. 2015లో పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.