రామచంద్రాపురం, జూలై 6: పరిసరాల శుభ్రతే లక్ష్యమని ఆర్సీపురం డివిజన్ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పానగేశ్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంగళవారం డివిజన్లోని కానుకుంట ఫేజ్ 1లో పరిసరాల శుభ్రతను నిర్వహించారు. కాలనీలో పిచ్చిమొక్కలను తొలగించి, ఓపెన్ డ్రైన్లను శుభ్రం చేయించారు. రోడ్లను మొత్తం ఊడ్పించారు. పలుచోట్ల దోమ మందులను పిచికారీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయని తెలిపారు. ప్రతి కాలనీలో శుభ్రత చర్యలను నిర్వహిస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన పట్టణ ప్రగతితో అద్భుత ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజు, కుమారస్వామి, లక్ష్మీప్రసన్న, మల్లేశ్, రవి, ప్రమోద్గౌడ్, నాగరాజు, బల్దియా అధికారులు ఉన్నారు.
ఇంటింటికీ హరితహారం మొక్కలు
బొల్లారం, జూలై 6 : మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో మూడో విడుత పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. మంగళవారం 17వ వార్డులో జరిగిన పట్టణ ప్రగతి పనుల్లో కౌన్సిలర్ హన్మంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వార్డు ప్రజలతో హరితహారం మొక్కలు నాటారు. అనంతరం ఆయన ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ హరితహారంలో భాగంగా ఇంటి ముందు పరిసరాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కాలనీలోని మురుగునీటి కాల్వలను పరిశీలించి, యంత్ర సహాయంతో పారిశుధ్య సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రాములు, ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ సిబ్బంది అలీ పాల్గొన్నారు.
పరిశీలించిన జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి
గుమ్మడిదల, జూలై 6: గ్రామాల్లో జరుగుతున్న పల్లెప్రగతి పనులను జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి సాయిసుభాశ్ పరిశీలించారు. మంగళవారం మంభాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న పల్లెప్రగతి పనులను జిల్లా నాణ్యతా విభాగం అధికారి పరిశీలించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన డంపింగ్యార్డు, వైకుంఠధామం, నర్సరీ, పల్లెప్రకృతి వనంను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ కంజర్ల శ్రీనివాస్, ఉపసర్పంచ్ దాయానంద్, ఈవో సుదర్శన్, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
అమీన్పూర్ మండల పరిధిలో…
అమీన్పూర్, జూలై 6: అమీన్పూర్ మండల పరిధిలోని గ్రామాల్లో నాల్గో విడుత ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంగళవారం మండలంలోని కిష్టారెడ్డిపేట, దయారా, వడక్పల్లి, పటేల్గూడ తదితర గ్రామాల్లో సర్పంచ్ ఆధ్వర్యంలో పల్లె ప్రగతి కార్యక్రమాలు చేపట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. హరితహారం మొక్కలు నాటి సంరక్షణకు కృషి చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్, గ్రామ పంచాయతీ పాలకవర్గం, అధికారులు పాల్గొన్నారు.
ఇంటింటికీ మొక్కలు పంపిణీ
కంది, జూలై 6 : ప్రతి ఇంటిలో ఆరు మొక్కలను నాటేలా ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. చెర్యాల్ గ్రామంలో మహిళలకు సర్పంచ్ శ్రావణ్కుమార్ మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగంగా ఆరు మొక్కలను నాటే విధంగా చూడాలన్నారు. ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
రూరల్ స్టేషన్లో మొక్కలు నాటిన డీఎస్పీ
కంది, జులై 6 : హరితహారం కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి రూరల్ పోలీస్స్టేషన్లో సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ మొక్కలను నాటారు. రూరల్ సీఐ శివలింగం, ఇతర నాయకులతో కలిసి ఆయన మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్సైలు సుభాష్, రాజేశ్నాయక్, టీఆర్ఎస్ నాయకులు బొంగుల రవి, విజయేందర్రెడ్డి, రామప్ప, శ్రవణ్కుమార్ పాల్గొన్నారు.
మొక్కలు నాటిన జడ్పీవైస్ చైర్మన్
జిన్నారం, జూలై 6: ఇంటింటికీ ఆరు మొక్కలు నాటాలని జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ ప్రజలను కోరారు. మంగళవారం అండూరు గ్రామంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ సర్పంచ్ ఖదీర్ తో కలిసి హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి, నాయకులు ప్రభాకర్రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఆయుధ కర్మాగారంలో హరితహారం
కంది, జులై 6 : ఆయుధ కర్మాగారం (ఓడీఎఫ్)లో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం ఆ సంస్థ జనరల్ మేనేజర్ ఆలోక్ ప్రసాద్ ఆధ్వర్యంలో కర్మాగారం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడే విధంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమం ఎంతో గొప్పదని ఆయన కితాబునిచ్చారు. కార్యక్రమంలో ఏజీఎం గోగినేని సుజాత, ఇతర ఏజీఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.