పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ కెరీర్లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ వరుస అవకాశాలు దక్కించుకుంటుంది నయనతార. ఇప్పటివరకు దక్షిణాది సినిమాలకే పరిమితమైన ఈ మలయాళీ భామ.. షారుఖ్ఖాన్ సినిమాతో బాలీవుడ్కు ఎంట్రీ ఇస్తుంది. అట్లీ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమా కోసం నయనతార తన పారితోషికం రెట్టింపు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో నయనతార ముందుంటుంది. ఈమె ఒక్కో సినిమాకు 3 నుంచి 4 కోట్ల మధ్య రెమ్యునరేషన్ అందుకుంటుంది నయనతార. ఇక ఇప్పుడు ఈ బాలీవుడ్ సినిమా కోసం రూ.6 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.