నారాయణఖేడ్ టౌన్, జూన్ 27 : విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి సూచించారు. ఆదివారం నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ గ్రామంలో ఆర్వీఎం పథకం ద్వారా మంజూరైన రూ.22 లక్షలతో నిర్మించిన 3 అదనపు తరగతి గదులు, రూ.9 లక్షలతో నిర్మించిన సైన్స్ ల్యాబ్, సర్వోదయ గ్రామ సేవ లైబ్రరీ, స్టడీ సెంటర్ వారి ఆధ్వర్యంలో విమల ఫౌండేషన్ వారి సహకారంతో జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన లైబ్రరీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా, వైద్య రంగాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత స్థాయికి ఎదిగి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో విమల ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శ్రీకాంత్, ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ సుధాకర్నాయక్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్రావు, జడ్పీటీసీ లక్ష్మీబాయిరవీందర్ నాయక్, వైస్ ఎంపీపీ సాయిరెడ్డి, సర్పంచ్ జగదీశ్వర్చారి, ఎంపీడీవో, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
హన్మంత్రావుపేట్లో లైబ్రరీ ప్రారంభం..
సర్వోదయ గ్రామ సేవ లైబ్రరీ, స్టడీ సెంటర్ వారి ఆధ్వర్యంలో విమల ఫౌండేషన్ వారి సహకారంతో నారాయణఖేడ్ మండలం హన్మంత్రావుపేట్ గ్రామ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన లైబ్రరీని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ప్రారంభించారు. అనంతరం గ్రామ యువకుడు గౌరీప్రసాద్ ఏర్పాటు చేసిన మినీ వాటర్ ట్యాంక్ను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ దత్తు, ఎంపీటీసీ లక్ష్మి, ఎంపీడీవో, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.