నిజామాబాద్ : జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ దాదన్నగారి కల్యాణ్ రావుకు (25)కు అశ్రునయనాల మధ్య వీడ్కోలు పలికారు. అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో నిర్వహించారు. బుధవారం పంజాబ్లో జరిగిన ప్రమాదంలో కల్యాణ్ రావు మృతి చెందగా..శుక్రవారం ఆయన భౌతికకాయాన్ని మిలటరీ అధికారులు పంజాబ్ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో..అక్కడి నుంచి స్వగ్రామం వెంకటాపూర్కు తరలించారు.
గ్రామానికి చేరుకున్న భౌతికకాయంతో ఇంటివరకు ఊరేగింపు నిర్వహించారు.అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర నిర్వహించగా..గ్రామస్తులు పార్థివదేహంపై పూల వర్షం కురిపించారు. తండ్రి వెంకటారావు దహన సంస్కారాలు నిర్వహించారు. అంతిమయాత్రలో మండలంలోని ఆయా గ్రామాల నుంచి వందలాది మంది యువకులు తరలివచ్చారు.
ఇవి కూడా చదవండి..
కాళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
బ్లాక్ మార్కెట్లో పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
వరంగల్లో హైటెక్స్ నిర్మాణానికి టీఎస్ఐఐసీ అనుమతులు
రైతువేదికలు ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
మొక్కలు నాటి సంరక్షిద్దాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్