హైదరాబాద్: కరోనా పరిస్థితుల నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్, పర్మిట్లు, వాహన ఫిట్మెంట్ సర్టిఫికెట్ల గడువును కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలపాటు పొడిగింది. దేశంలో అనేక ప్రాంతాల్లో లాక్డౌన్ అమలవుతుండటంతో సెప్టెంబర్ 30 వరకు గడువును కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పొడిగించింది. మోటారు వాహనాల చట్టం (1988), కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు (1989) పరిధిలోకి వచ్చే అన్నిరకాల పత్రాల గడువును ఈ మేరకు పెంచినట్లు పేర్కొంది. కరోనా నేపథ్యంలో గతేడాది ఫిబ్రవరి 1తో గడువు ముగిసిన వాహన పత్రాల గడువును పొడిగిస్తూ వస్తున్నది. ఈనేపథ్యంలో గడువు మీరిన సర్టిఫికెట్లు సెప్టెంబర్ నెలాఖరు వరకు చెల్లుబాటులో ఉంటాయి.