మూడు నెలల్లోపే గర్భిణులను గుర్తించాలి

- నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ధన్రాజ్
- జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన
నిర్మల్ అర్బన్, జనవరి 5 : గర్భిణులను మొదటి మూడు నెలల్లోపే గుర్తించి వారి వివరాలను నమోదు చేయాలని నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ధన్రాజ్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మంగళవారం జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణులను ముందుగానే గుర్తిస్తే వారికి ఉన్న అనారోగ్య సమస్యలను తెలుసుకొని మెరుగైన వైద్యం అందించవచ్చని పేర్కొన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, సిజేరియన్లతో కలిగే నష్టాలను వారికి వివరించాలని తెలిపారు. క్షయ, లెప్రసీ, కొవిడ్-19, అసంక్రమిత వ్యాధులు, ఇమ్యునైజేషన్ తదితర కార్యక్రమాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డిప్యూటీ డీహెంఎచ్వో చుక్క శ్రీకాంత్, ఆశిష్రెడ్డి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి అవినాశ్, వైద్యులు కార్తీక్, కిరణ్మయి, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- బిగ్బాస్ టాలెంట్ మేనేజర్ దుర్మరణం
- 2,910 కరోనా కేసులు.. 52 మరణాలు
- మహిళలూ.. ఫైబర్ ఎక్కువ తినండి ఎందుకంటే..?
- గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి : సీఎస్
- 116కు చేరిన బ్రిటన్ వేరియంట్ కరోనా కేసులు
- అంతర్రాష్ట్ర గజదొంగ బాకర్ అలీ అరెస్ట్
- జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు
- స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ రూ.1000 కోట్లు
- హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు
- జనవరిలోనే రవితేజ ‘క్రాక్’ ఓటిటిలో విడుదల..?