జైపూర్ : ఏడారి రాష్ట్రం రాజస్థాన్లో భానుడి భగభగలకు ప్రజలకు అల్లాడుతున్నారు. పలు జిల్లాల్లో గరిష్ఠంగా 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. గడిచిన 24 గంటల్లో శ్రీగంగానగర్ జిల్లాలో అత్యధికంగా 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత్త నమోదైనట్లు వాతావారణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నందున భరత్పూర్, ధోల్పూర్, ఝున్ఝున్, సికర్, చూరు, ఘనుమాన్ఘర్, గంగానగర్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పశ్చిమ రాజస్థాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని, జోధ్పూర్, బికనీర్ జిల్లాల్లో 30 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న నాలుగు రోజులూ రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయ్పూర్, కోటా జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.