ఢిల్లీ ,జూన్ 5: కోవిడ్ సెకండ్ వేవ్ పై పోరాటానికి, తమ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు స్నేహితుల ఆరోగ్య భద్రత కోసం విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మహారత్న సిపిఎస్యు అయిన ఎన్టిపిసి, తమ కార్యాలయాలున్న పలు ప్రాంతాలలో వాక్సినేషన్ శిబిరాలను నిర్వహిస్తున్నది. ఐదురోజులలో ఢిల్లీలోని ఎన్టిపిసి స్కోప్ ఆఫీసులో మొత్తం 2013మంది టీకాలు వేశారు. కోవిడ్ నియమనిబంధనలు పాటిస్తూ వాక్సినేషన్ ప్రక్రియను నిర్వహించారు.
తన కార్యకలాపాలు నిర్వహించే అన్ని ప్రాంతాలలో ఇప్పటికే ఎన్టీపీసీ తన సిబ్బంది,కార్మికులు, వారి కుటుంబ సభ్యులు మొత్తం 70,000 మందికి టీకాలు వేసింది. అర్హులైన సిబ్బంది, వారిపై ఆధారపడిన వారందరికీ టీకా ద్వారా రక్షణ కల్పించాలన్నది ఎన్టిపిసి లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రస్తుతం వాక్సినేషన్ శిబిరాలు ఎన్టీపీసీ కార్యాకలాపాలు సాగించే 72 ప్రాంతాలలో కొనసాగుతోంది. ఇందులో జెవిలు, అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి.