మెరుగైన ప్రమాణాలకు దక్కిన గుర్తింపు
‘ఎన్క్యూఏఎస్’కు ఎంపిక
కేంద్ర హెల్ ్తఅండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం ఉత్తర్వులు
వైద్య సిబ్బంది, స్థానికుల హర్షం
బజార్హత్నూర్ మే 31: రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాల కల్పన, దవాఖాన నిర్వహణ, వైద్య సిబ్బంది పనితీరులో ఆదిలాబాద్ జిల్లాలోని బజార్హత్నూర్ పీహెచ్సీకి జాతీయ ఖ్యాతి వచ్చింది. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం విడుదల చేసిన నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్స్లో చోటు దక్కింది. ఈ మేర కు తాజాగా ఉత్తర్వులు జారీ చేయగా, దవాఖాన సిబ్బంది, గ్రామస్తుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెం ట్, డెలివరీలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పనితీరును కేంద్ర ప్రభుత్వ కుటుంబ సంక్షేమ, వైద్యారోగ్య శాఖ అధికారులు మార్చిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు దఫాలుగా అసెస్మెంట్ చేసి ప్రభుత్వానికి నివేదించగా, రాష్ట్రంలోని నాలుగు పీహెచ్సీలకు సర్టిఫికెట్ దక్కింది. ఇందులో బజార్హత్నూర్ పీహెచ్సీ, కొత్తగూడెం జిల్లా సుల్తాన్గర్ పీహెచ్సీ, మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల పీహెచ్సీ, పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ పీహెచ్సీలను ఎంపిక చేశారు. గత సెప్టెంబర్లో కాయకల్ప ఆవార్డు రాగా, ఇప్పుడు మరోసారి గుర్తింపురావడం ఆనందంగా ఉందని వైద్యాధికారి డా.సురేశ్ తెలిపారు. ఎంపీపీ అజిడే జయశ్రీ, జడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య, ఎంపీటీసీ తిరుమల, పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.