తిరువనంతపురం: కరోనాను నియంత్రించడానికి అవసరమైన వ్యాక్సిన్లను కేంద్రమే కొనుగోలు చేసి, రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కేరళ సీఎం పినరాయి విజయన్ కోరారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించేందుకు కలిసి రావాలని 11 బీజేపీయేతర పాలిత రాష్ట్రాల సీఎంలకు సోమవారం లేఖలు రాశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకూ కూడా ఆయన లేఖ రాశారు.
అన్ని రాష్ట్రాలపై అసాధారణ స్థాయిలో కరోనా రెండో వేవ్ ప్రభావం పడిందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని తెలిపారు.
ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయాల్సిన బాధ్యత నుంచి తప్పుకునేందుకు కేంద్రం ప్రయత్నించడం దురద్రుష్టకరం అని వ్యాఖ్యానించారు.
ప్రజల బాగోగులను పరిగణనలోకి తీసుకుని ఉచితంగా వారికి వ్యాక్సినేషన్ చేయడం చాలా ముఖ్యం అని తెలిపారు. నిధుల కొరతతో ఏ ఒక్కరికీ అందుబాటులోకి రాకుండా చూడొద్దన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతోపాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల సీఎంలకు ఆయన లేఖలు రాశారు.
కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ల కొరతతో సతమతం అవుతున్నాయని వార్తలొస్తున్న నేపథ్యంలో 11 రాష్ట్రాల సీఎంలకు విజయన్ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
ఒకవైపు కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తుందన్న ఆందోళనల మధ్య, వ్యాక్సిన్లను కొనుగోలు చేయాల్సి వస్తే రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. తత్ఫలితంగా ఆయా రాష్ట్రాల ద్రవ్య లభ్యత తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రేపట్నుంచి బ్యాంకుల పని వేళల్లో మార్పు
ఐటీ రూల్స్: ఫిర్యాదుల స్వీకరణకు సోషల్ మీడియా ఏర్పాట్లు!
చిన్న వ్యాపారులకు రిలీఫ్.. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ!
ఎస్బీఐ vs యాక్సిస్ vsహెచ్డీఎఫ్సీ ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా..
కరోనా వేళ కస్టమర్లకు ఎస్బీఐ రిలీఫ్.. అదేంటంటే!!
మోదీ సర్కార్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : సచిన్ పైలట్
జూన్ 20 తర్వాత స్పుత్నిక్ వీ టీకాల తొలి బ్యాచ్ రాక
రాజద్రోహానికి పరిమితులను సెట్ చేయాల్సిందే: సుప్రీంకోర్టు
ఆర్థిక ఇబ్బందులతో సర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు
రెండు వేర్వేరు డోసులు తీసుకుంటే ఎలా ? వ్యాక్సిన్ మిక్సింగ్పై త్వరలో స్టడీ
కరోనా చికిత్స: రూ.5 లక్షల వరకు అన్సెక్యూర్డ్ లోన్లు!
ఐసోలేషన్ కేంద్రంతో నిరుపేదలకు మేలు